కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈరోజు మరోసారి ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా మరిన్ని కీలక నిర్ణయలు వెలువరించే అవకాశం ఉంది.