వరికి బదులు వేరే పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలి - కేసీఆర్

*ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి *దళిత బంధుపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలి

Update: 2021-12-17 12:04 GMT

 పార్టీ కేడర్‌కు సీఎం కేసీఆర్‌ సూచనలు(ఫైల్-ఫోటో)

Telangana Bhavan: తెలంగాణ భవన్‌లో జరిగిన TRS కీలక సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్‌కు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లందరికీ పదవులు వస్తాయన్నారు. నామినేటెడ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్న కేసీఆర్‌ నాయకులు కొంత ఓపికతో ఉండాలన్నారు.

దళితబంధుపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తేవాలన్నారు సీఎం కేసీఆర్.

Tags:    

Similar News