CM KCR: గంజాయిపై యుద్ధం ప్రకటించాలి

CM KCR: గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి : సీఎం కేసీఆర్

Update: 2021-10-20 12:10 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గంజాయి సరఫరాను అడ్డుకోకుంటే మనం సాధిస్తున్న విజయాలు నిర్వీర్యం అవుతాయన్నారు సీఎం. గంజాయి యుద్ధం చేయాలని డ్రగ్స్ సరఫరాను అరికట్టాలన్నారు. ఆ దిశగా అధికారులు పటిష్ట వ్యూహాన్ని రచించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారులు తమ జిల్లాల పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సీఎంకు వివరించారు. రాష్ట్రంలో గుడుంబా, పేకాట నియంత్రణ పటిష్టంగా అమలు అవుతున్నప్పటికీ అక్కడక్కడా తిరిగి మొదలవుతున్నట్టు సీఎం కేసీఆర్ అన్నారు. 

Tags:    

Similar News