జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో కేసీఆర్ జాతీయ జెండాను ఎగరవేశారు.
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో కేసీఆర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు.. గత ఐదేళ్లలో మనం చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని అన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ది ఐదేళ్లలో రెట్టింపు అయ్యిందన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పేరెడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.