వరంగల్‌లో సీజేఐ ఎన్వీ రమణ పర్యటన.. ఫ్యామిలీ కోర్టు, పోక్సో కోర్టు ప్రారంభం

*వరంగల్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవిత చదివి వినిపించిన సీజేఐ *ఓరుగల్లుతో ఆత్మీయ అనుబంధం ఉందన్న సీజేఐ

Update: 2021-12-19 15:00 GMT

వరంగల్‌లో సీజేఐ ఎన్వీ రమణ పర్యటన  

CJI NV Ramana: వరంగల్‌ జిల్లాలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించారు. వరంగల్ ప్రాంతంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని వెల్లడించారు. వరంగల్‌లో 3 సాహిత్య పాఠశాలలకు హాజరయ్యానని తెలిపారు. ఈ క్రమంలో వరంగల్ గొప్పతనాన్ని చాటుతూ ఓ కవిత చదివి వినిపించారు. అద్భుత కట్టడాలు, ఆలయాలకు నెలవు ఓరుగల్లు అని వివరించారు. ఈ ప్రాంతం గొప్పదనాన్ని యునెస్కో కూడా గుర్తించిందని అన్నారు.

Tags:    

Similar News