Warangal: కోర్టు భవనాల సముదాయం ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ

Warangal: పోక్సో కోర్టులో బాధిత చిన్నారుల కోసం ప్రత్యేకంగా గది...

Update: 2021-12-19 07:05 GMT

Warangal: కోర్టు భవనాల సముదాయం ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ

Warangal: వరంగల్‌ లో కోర్టు భవనాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఆపై కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హనుమడు, కొండడు శిలను సీజేఐ ఎన్వీ రమణ ఆవిష్కరించారు.కోర్టు భవన సముదాయంతో పాటు ఫ్యామిలి కోర్టు, ఫోక్సో కోర్టు భవనాలు ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు పాల్గొన్నారు. అంతకుముందు కార్యక్రమానికి వచ్చిన సీజేఐ ఎన్వీ రమణకు పలువురు ప్రముఖులు, న్యాయవాదులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.

Tags:    

Similar News