కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. కోడెల ఆత్మహత్య ఘటనపై రేపు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలువాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పార్టీ నేతలతో కలిసి గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలు , ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలను గవర్నర్ కి వివరించనున్నారు.