సెల్ టవర్ లో ఫైర్..

Update: 2019-12-21 10:46 GMT

నిజామాబాద్‌ జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. గాజుల పేటలో ఉన్న ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌ నుంచి సడెన్‌గా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News