మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు

*గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో భూవివాదం

Update: 2022-05-19 06:15 GMT

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో భూవివాదం

Gundlapochampally: పేట్‌బషీరాబాద్‌లో భూవివాదం కేసులో గుండ్లపోచంపల్లి మున్సిపల్ లోని వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్దిపై కేసు నమోదైంది. సర్వే నెం.5, 6 భూమి విషయంలో మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య వివాదం నేపథ్యంలో మల్లారెడ్డి బావమరిదైన శ్రీనివాస్‌రెడ్డి 3 రోజుల క్రితం కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ రెడ్డితోపాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వీరిలో 10 మందిని ఇప్పటికే రిమాండ్‌ కు తరలించారు. మిగిలిన ఐదుగురిలో శ్రీనివాస్‌రెడ్డి, విద్యాసాగర్‌, నర్సింహారెడ్డితో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

Tags:    

Similar News