హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు బోల్తా

Update: 2020-01-31 05:42 GMT
హైదరాబాద్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు బోల్తా

హైదరాబాద్ రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫ్లై ఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు క్రేన్‌ సహాయంతో కారును తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News