కొత్త సచివాలయంపై సీఎం కేసీఆర్‌కు నివేదిక

కొత్త సచివాలయం నిర్మాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించింది. నేటి ఉదయం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నివేదిక సమర్పించింది.

Update: 2019-08-30 06:21 GMT

కొత్త సచివాలయం నిర్మాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించింది. నేటి ఉదయం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ ఉపసంఘం ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నివేదిక సమర్పించింది. ఇక అంతకు ముందు కొత్త సచివాలయం ఏర్పాటుపై సంబంధించి వివిధ శాఖల ఇఎన్‌సిలు మంత్రి వర్గ ఉపసంఘానికి నివేదిక ఇచ్చాయి. ఆ నివేదికను అనుసరించుకొని మంత్రివర్గ సంఘం తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్ అండి బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివేదికను కేసీఆర్‌కు అందజేశారు.

Tags:    

Similar News