Padma Rao: సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

Padma Rao: కాంగ్రెస్‌ గ్యారెంటీలను అమలు చేయడంలేదు

Update: 2024-03-24 11:08 GMT

Padma Rao: సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

Padma Rao: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. ఈ సారి సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్. సికింద్రాబాద్ పరిధిలోని గులాబీ నేతల ఏకాభిప్రాయంతో తన పేరును ఖరారు చేశారని ఆయన తెలిపారు. ప్రజలే తమ కుటుంబమని.. వారినే నమ్ముకున్నామన్నారు. ఇక.. కాంగ్రెస్ , బీజేపీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు పద్మారావు. రేవంత్ సర్కార్ గ్యారెంటీలను అమలు చేయడం లేదని ఆరోపించారాయన. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా సికింద్రాబాద్ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు పద్మారావుగౌడ్..

Tags:    

Similar News