BRS: ప్రతినిధుల సభలో తీర్మానాలు ప్రవేశపెట్టిన బీఆర్ఎస్

BRS: 24 గంటల పాటు దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్

Update: 2023-04-27 09:33 GMT

BRS: ప్రతినిధుల సభలో తీర్మానాలు ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ 

BRS: ప్రతినిధుల సభలో పలు తీర్మాణాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. దేశంలో రైతు రాజ్యం స్థాపించాలని, ప్రతిరాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలని తీర్మానం చేశారు. 24 గంటల పాటు దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి కొత్త పాలసీ అమలు చేయాలని తీర్మానించారు. మన దేశ బ్రాండ్‌తో విదేశాలకు ఆ‍హార ఉత్పత్తుల ఎగుమతి, దళితబంధు దేశ వ్యాప్తంగా అమలు, దేశంలో భారీ స్థాయిలో మౌళిక వసతులు కల్పన, దేశంలో బీసీ జనగణన, ద్వేషాన్ని విడిచి ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలని తీర్మానం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు, పని చేయాలని తీర్మానించారు.    

Tags:    

Similar News