కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల సమావేశం

*హాజరుకానున్న సునీల్ బన్సల్, బండి సంజయ్, లక్ష్మణ్, మురళీధరరావు

Update: 2022-09-10 09:04 GMT

కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల సమావేశం

Telangana: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సన్నాహాక నేతల సమావేశం సాయంత్రం జరగనుంది. ఈ భేటీలో బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలపై నేతలు చర్చించనున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమానికి అమిత్ షా రానున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లపై నేతలు చర్చిస్తారు. 

Tags:    

Similar News