యూరియా కొరతను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ బీజేపీ నిరసనలకు దిగింది. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ అధికార ప్రతినిధి రఘనందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. సిద్ధిపేటలో ఎరువుల కొరకు క్యూలైన్లో నిలబడి చనిపోయిన రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రఘనందన్ డిమాండ్ చేశారు.కలెక్టరేట్లో కీలక అధికారులు లేకుండా ఎమ్మెల్యేలు ఎలా రివ్యూ సమావేశాలు చేపడతారని రఘనందన్ ప్రశ్నించారు.