సీఎం కేసీఆర్ పై కౌంటర్ వేసిన బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ( సోమవారం ) తమిళనాడులోని అత్తి వరదరాజ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం కోసం కుటుంబ సమేతంగా వెళ్ళిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ఆయనకి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆతిద్యం ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేసారు
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ( సోమవారం ) తమిళనాడులోని అత్తి వరదరాజ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం కోసం కుటుంబ సమేతంగా వెళ్ళిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ఆయనకి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆతిద్యం ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేసారు . అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ రాయలసీమ అభివృద్ది కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కలిసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు . అంతేకాకుండా రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు తమ వంతుసాయం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు . అయితే సీఎం కేసీఆర్ వాఖ్యల పై తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. "కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నడట.. సింగూరు, నిజాం సాగర్ లకు చుక్కనీరు రాకుండా తెలంగాణ భూములు బీడు పారుతుంటే పట్టించుకోరు.. కానీ రాయలసీమను మాత్రం రతనాలసీమగా మారుస్తారట" అంటూ ఎద్దేవా చేశారు ...
కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నడట..
— Dr K Laxman (@drlaxmanbjp) August 13, 2019
సింగూరు, నిజాం సాగర్ లకు చుక్కనీరు రాకుండా తెలంగాణ భూములు బీడు పారుతుంటే పట్టించుకోరు.. కానీ రాయలసీమను మాత్రం రతనాలసీమగా మారుస్తారట..#DrKLaxman