Telangana: రహస్య సమావేశాలపై రంగంలోకి బీజేపీ అధిష్టానం

Telangana: రహస్య సమావేశాలపై బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి బాధ్యతలు అప్పగించింది.

Update: 2022-01-17 11:06 GMT

Telangana: రహస్య సమావేశాలపై రంగంలోకి బీజేపీ అధిష్టానం

Telangana: రహస్య సమావేశాలపై బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. బీజేపీ నేతల రహస్య భేటీ సారాంశాన్ని ఇంద్రసేనారెడ్డి ఆరా తీస్తున్నారు. రహస్య సమావేశం నిర్వహించిన నేతలు హైదరాబాద్ రావాలని ఆదేశాలు జారీ చేశారు.

రహస్యంగా భేటీ అయిన వారిపై చర్యలు తీసుకునే బాధ్యతను ఇంద్రసేనారెడ్డికి అప్పజెప్పింది అధిష్టానం. అధ్యక్షుడు బండి సంజయ్‌కు సంబంధం లేకుండా ఇంద్రసేనారెడ్డితో విచారణ జరిపిస్తోంది జాతీయ నాయకత్వం. కరీంనగర్‌లో రహస్య భేటీ నిర్వహించిన కీలక నేతలపై నేడో రేపో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Full View


Tags:    

Similar News