హుజూర్నగర్ ఉపఎన్నికపై బీజేపీ కోర్ కమిటీ సమావేశం
-తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం -హుజూర్నగర్ ఉపఎన్నికపై చర్చ -అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, అభ్యర్థి ఎంపికపై ఈ కోర్ కమిటీలో చర్చ జరుగుతుంది. మున్సిపల్ బిల్లు, గాంధీ జయంతి, వీర్ సావర్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై కూడా కోర్ కమిటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో హుజూరునగర్ ఉపఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి విషయమై చర్చ జరగనుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాల్లోకి తీసుకువెళ్లాలని అంశంపై బీజేపీ నేతలు సుధీర్ఘంగా చర్చించనున్నారు.