యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో కాంగ్రెస్ రచ్చబండ

Beerla Ilaiah: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య

Update: 2022-06-27 07:15 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో కాంగ్రెస్ రచ్చబండ

Beerla Ilaiah: మోడీ, కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

8 ఏళ్ల పాలనలో వృదాప్య ఫించన్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, రైతులను మోసం చేశారని కేసీఆర్‌పై బీర్ల ఐలయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు కనిపిస్తున్నాయే తప్ప.. టీఆర్‌ఎస్ ఇచ్చిన ఇళ్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News