భూపాలపల్లిలో భూ మాఫియా రెచ్చిపోతోంది.. భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు.. మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వకపోయినా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా డాక్టర్ కాశయ్యకు చెందిన భూమిని సీతారాం నాయక్ అనే వ్యక్తి కబ్జా చేశాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే సీతారాంనాయక్ తన కొడుకులు ఇద్దరితో కలిసి దాడి చేశాడని.. ఈ దాడిలో కాశయ్య తలకు బలమైన గాయం కావడంతో.. ఆయనను ఆసుపత్రికి తరలించారు.