Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay: కౌలు రైతుల సంక్షేమం కోరుతూ సంజయ్ సూచనలు

Update: 2022-03-01 14:00 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjay: రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి ప్రభుత్వం నుండి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాకపోవడం బాధాకరమన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. భూ యజమానుల హక్కులకు భంగం వాటిల్లకుండా కౌలు రైతులకు భరోసా కల్పించేలా 11వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నట్టు కౌలు చట్టంలో మార్పు చేయాలని ఆయన కోరారు. దీనిపై చర్చించేందుకు రైతు సంఘాలు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సంజయ్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. 

Tags:    

Similar News