కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

Bandi Sanjay: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న వ్యాఖ్యలు తాను చేయలేదని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2022-08-05 09:01 GMT

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

Bandi Sanjay: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న వ్యాఖ్యలు తాను చేయలేదని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. వెంకట్ రెడ్డి ఎప్పుడు తనను కలవలేదు, మాట్లాడలేదని.. కేవలం ఆయన ప్రధానిని కలిశారని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. ఏ ఎంపీ అయినా ప్రధాని కలవడం సహజమని.. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు. మునుగోడులో ఉపఎన్నిక కోరుకున్నదే కేసీఆర్ అని.. మునుగోడు ఉపఎన్నికతో పాటుగా తెలంగాణలో ఎక్కడ ఎన్నిక వచ్చినా గెలిచేదేది బీజేపీయేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News