Bandi Sanjay: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా
Bandi Sanjay: ప్రధాని మోడీ అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టారు
Bandi Sanjay: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా
Bandi Sanjay: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మోడీ చేసిన అభివృద్ధిని చూసి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరబోతుందన్నారు. అయోధ్య నుంచి అగర్తల వరకు నరేంద్ర మోడీ హవా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో రాబోయేది రామరాజ్యం అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీనే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.