Bandi Sanjay: నిరుద్యోగులకు లక్షరూపాయల పరిహారం ఇవ్వాలి

Bandi Sanjay: ప్రక్షాళన తర్వాతే ఉద్యోగనియామాకాలు చేపట్టాలి

Update: 2023-04-25 02:03 GMT

Bandi Sanjay: నిరుద్యోగులకు లక్షరూపాయల పరిహారం ఇవ్వాలి

Bandi Sanjay: నిరుద్యోగులకు న్యాయంచేయాలని ఇవాళ ఛలో పాలమూరు కార్యక్రమానికి తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల గోస- బిజెపి భరోసా పేరుతో నిరుద్యోగులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీపై న్యాయవిచారణ చేపట్టాలని, నిరుద్యోగులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని, ప్రశ్నాపత్రాలకు భద్రత కల్పించలేని ఐటి మంత్రిని బర్తరఫ్ చేయాలని ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయకుండా... హడావుడిగా పరీక్ష షెడ్యూలును ప్రకటించారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు న్యాయం చేసేదాకా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు.

Tags:    

Similar News