క్యాన్సర్ బాధితురాలికి బాలయ్య ఆత్మీయ పరామర్శ

Update: 2019-11-12 11:37 GMT

సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్న నందమూరి బాలకృష్ణ తన నిజజీవితంలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ తల్లి బసవతారకమ్మ పేరిట నెలకొల్పిన బసవతారకం కాన్సర్ ఆస్పత్రిలో ఎంతో మంది చికిత్స పొందుతున్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి కూడా ఈ బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో తక్కువ ఖర్చుతో చికిత్సను అందిస్తున్నారు.

ఇదే కోణంలో అనంతపురంకు చెందిన స్నప్న అనే విద్యార్థి కొన్ని రోజులుగా ఎముకల క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆ విద్యార్థినిని వైద్యం కోసం అనంతపురం నుంచి హైదరాబాద్ లోని బసవతారకం కాన్సర్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాలకృష్ణ స్నప్నకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో స్వప్నకు అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నారు. ఇదే నేపధ్యంలో బాలయ్య ఆమెను ఆప్యాయంగా పరామర్శించారు. ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదంటూ, మేమంతా ఉన్నామంటూ ధైర్యం చెప్పారు. ఆమెకు వైద్యం అందిస్తున్న వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థతి ఏ విధంగా ఉన్నదన్న విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయనతో పాటు తీసుకొచ్చిన కానుకలను ఆమెకు అందించారు. దీంతో ఆ విద్యార్థిని ముఖంలో తన కుటుంబ సభ్యులు ముఖాల్లో చిరునవ్వులు చిందాయి.



Tags:    

Similar News