ఈ రోజు అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నేపద్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సభ్యులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తమకు అనుకూలంగా ఎటువంటి హామీలు ఇవ్వలేదని నెట్వర్క్ యాజమాన్యం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 1500 కోట్ల రూపాయల బకాయిలు వాస్తవమని సభ్యులు చెప్పారు. బకాయిలు చెల్లించేవరకు సమ్మె చేస్తామని వారు చెబుతున్నారు .