ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. శనివారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు షా నాదెండ్లతో పాటు పలువురికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన వారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్రెడ్డి, మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, నిర్మాత బెల్లంకొండ రమేశ్, రామగుండం డిప్యూటీ మేయర్ ఎం సత్యప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం తెదేపా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్, సిద్ధా వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్, మాజీ ఎంపీ చాడా సురేశ్రెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.