ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరుగుతోంది. అంతకుముందు గవర్నర్ నరసింహన్తో జగన్ భేటీ అయ్యారు. వీరి మధ్య గంటకు పైగా సమావేశం కొనసాగింది. ఉమ్మడి రాష్ట్ర ఆస్తులు, నీటి పంపకాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నెలలో నీటి పంకాలు, ఆస్తులపై ఇరురాష్ట్రాల అధికారులు భేటీ కానున్న నేపథ్యంలో గవర్నర్, సీఎం కేసీఆర్తో జగన్ భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.