మహిళలను వేధింపులకు గురిచేస్తున్న యువకుడికి దేహశుద్ధి జరిగింది. ఈ ఘటన నల్గొండ పట్టణంలో జరిగింది. శ్రీశైలం అనే యువకుడు కొంతకాలంగా జులాయిగా తిరుగుతూ వివాహితలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో స్థానిక మహిళ తనను వేధిస్తున్న శ్రీశైలంను భర్త సహాయంతో పట్టుకుంది. చెట్టుకి కట్టేసి కర్రతో బడిత పూజ చేసింది. అనంతరం స్థానికులంతా కలిసి పోలీసులకు అప్పగించారు.