Andhra Pradesh: ఏపీలో మంత్రుల బస్ యాత్ర

Andhra Pradesh: ఈనెల 26 నుంచి 4 రోజులు బస్ యాత్ర

Update: 2022-05-19 03:00 GMT

Andhra Pradesh: ఏపీలో మంత్రుల బస్ యాత్ర 

Andhra Pradesh: ఏపీ మంత్రులు బస్ యాత్రకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు సామాజిక న్యాయం ఈ అంశాలన్నీ జనంలోకి తీసుకువెళ్లేలా బస్ యాత్ర నిర్వహించనున్నారు.

ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు ఏపీ మంత్రులు బస్ యాత్ర నిర్వహించనున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం జనానికి వివరించడమే ప్రధాన అజెండాగా ఈ బస్ యాత్ర జరగనుంది. 17మంది ఎస్సి , ఎస్టీ , బిసి , మైనారిటీ మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యే లు పార్టీ సీనియర్స్ ఈ బస్ యాత్ర లో ఉంటారు. ఇప్పటికే గడప గడప కు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇది కాకుండా మంత్రులతో నాలుగు రోజులు మరింత ఎక్కువగా ప్రచారం చేయించాలని ఉద్దేశంతో ఈ బస్ యాత్ర ఏర్పాటు చేశారు.

బస్ యాత్రతో పాటు నాలుగు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు . అదేవిధంగా మంత్రులు కొన్ని ప్రాంతాల్లో బస్ నుంచే ప్రజలను ఉద్దేశించి ప్రసం గాలు చేయనున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న సామాజిక న్యాయం, బిసిలకు, ఎస్సిలకు, మైనారిటీలకు లభించే ప్రాధాన్యత గురించి మంత్రులు బస్ యాత్రలో వివరించనున్నారు.

Tags:    

Similar News