కామారెడ్డి బస్టాండ్లో విషాదం జరిగింది. ప్లాట్ఫామ్పైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదానికి నిండు ప్రాణం బలైంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు మృతుని బంధువులు చెప్తున్నారు. కామారెడ్డి డిపోకి చెందిన ఏపీ 29 Z 33 -15 నెంబర్ గల ఆర్టీసీ బస్సు JBS కి బయలుదేరేందుకు ప్లాట్ఫామ్పైకి వచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో.. ప్లాట్ఫామ్పై కూర్చున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిదుపేట గ్రామానికి చెందిన 35 ఏళ్ల లక్ష్మణ్.. అక్కడికక్కడే చనిపోయాడు. బస్సు డ్రైవర్ తప్పిదంతోనే నిండు ప్రాణం బలైందని ప్రయాణికులు తెలిపారు.