మారుతీరావు ఆత్మహత్యపై కుమార్తె అమృత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మారుతిరావు ఎందుకు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో చెప్పలేననన్నారు. కుటుంబంలో ఆస్తి తగదాలున్నాయని అమృత చెప్పింది. మనిషిని చంపించేంత ధైర్యం ఉన్న వాళ్లు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వారు కాదన్నారు ప్రణయ్ హత్యకు ముందు మారుతీరావు ఆస్తులు పంచుకోలేదని చెప్పారు. తాను బయటికొచ్చాక ఆస్తులు పంచుకున్నారని చెప్పారు భర్త చనిపోతే భార్య పడే బాధలు తనకు తెలుసన్నారు. తల్లి దగ్గరకి వెళ్లి ఉండలేను నా దగ్గరికి వచ్చి ఉంటా అంటే అభ్యంతరం లేదు. ప్రణయ్ చనిపోయినప్పుడే బలంగా ఉన్నా ఇప్పుడెందుకు ఉండలేను' అని అమృత చెప్పుకొచ్చింది.