Breaking: తల్లి గిరిజను కలిసిన అమృత

Update: 2020-03-14 14:38 GMT
Amrutha meet her mother

ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. మిర్యాలగూడలో మారుతీరావు ఇంటికి వెళ్లిన అమృత అక్కడ తన తల్లి గిరిజాను కలిసింది. మారుతీరావు మరణం తరువాత తొలిసారి తల్లి దగ్గరకు వెళ్లిన అమృత దాదాపు అరగంట పాటు ఆమెతో గడిపింది. ఈ సందర్భంగా తల్లిని పరామర్శించింది. ఇటీవల అమృత తండ్రి, ప్రణయ్‌ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

ఆయన అంత్యక్రియల సందర్భంగా కడసారి తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తండ్రి మరణం అనంతరం శనివారం సాయంత్రం తొలిసారి తల్లి గిరిజను చూసేందుకు పోలీసుల రక్షణ నడుమ అమృత తన నివాసానికి వచ్చి పరామర్శించారు. అయితే ప్రణయ్ తల్లిదండ్రులను వదిలిపెట్టి తాను తల్లి దగ్గరకు వెళ్లలేనని అమృత తేల్చి చెప్పింది. ఒకవేళ తన తల్లి తన దగ్గరికి వస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది.

Tags:    

Similar News