తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

Update: 2019-03-24 13:26 GMT

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కారెక్కారు. తాజాగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తను రెండు సార్లు ఓడిపోవడానికి కోమటిరెడ్డి సోదరులే కారణమని.. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితుడినై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.  

Similar News