సీఎం కేసీఆర్కు మురుగునీరు పార్శిల్ చేసిన వ్యక్తి గుర్తింపు
సీఎం కేసీఆర్, డీజీపీ, ఇతర వీఐపీలకు మురుగునీరు పార్సిల్ చేసిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం కేసీఆర్, డీజీపీ, ఇతర వీఐపీలకు మురుగునీరు పార్సిల్ చేసిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన ఉత్తరమండల టాస్క్ఫోర్స్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సికింద్రాబాద్ వాసీగా పోలీసులు గుర్తించారు. నిందితుడి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు అతడి మానసిక పరిస్థితిపై విచారిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్, కేటీఆర్, డీజీపీ మహేందర్రెడ్డి వంటి ప్రముఖుల పేరుతో నిందితుడు పార్శిల్స్ పంపిణ సంగతి తెలిసిందే.