అమృతకు వేధింపులు.. పెళ్లి చేసుకుంటానంటూ యువకుడి లేఖ!

నల్లగొండలోని మిర్యాలగూడలో పరువు హత్య గురైనా ప్రణయ్ భార్య అమృతకు వేధింపులు తప్పడం లేదు. అమృత తండ్రి మరుతీరావు ఆమె భర్తను హత్యచేయిన ఘటన 2018లో రాష్ట్ర వాప్తంగా సంచలనం రేపింన సంగతి తెలిసిందే. బిడ్డతో సంతోషంగా జీవిస్తున్న అమృత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.

Update: 2019-09-25 06:40 GMT

నల్లగొండలోని మిర్యాలగూడలో పరువు హత్యకు  గురైన ప్రణయ్ భార్య అమృతకు వేధింపులు తప్పడం లేదు. అమృత తండ్రి మరుతీరావు ఆమె భర్తను హత్యచేయించిన  ఘటన 2018లో రాష్ట్ర వాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బిడ్డతో సంతోషంగా జీవిస్తున్న అమృత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కొంత కాలంగా ఓ అపరిచిత వ్యక్తి ఆమెను బెదిరింపులకు గురిచేస్తున్నాడు.

అయితే, ఈ నెల 11 ప్రణయ్ వర్దంతిరోజు ఇంట్లో ఓ అపరిచిత వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రవేశించి కవర్ డోర్ కు ఒక కవర్      తగిలించి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి కవర్ తారస పడింది.  వారు దానిని తెరిచి చూడగానే అందులో ఒక  లెటర్ ఉంది. ఆ జాబులో అమృతకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని రాసి వుంది. దీంతో ఈ అంశంపై అమృత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈ క్రమంలో  ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. సీసీ కెమెరాలో ఒక యువకుడు గేటు వద్ద కవర్ ఉంచుతున్న దృశ్యాలు  రికార్డైయ్యాయి. అడ్రస్ లో రాసిన దాని ప్రకారం ఆ వ్యక్తి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని గోనె సతీష్ గా గుర్తించారు.  ఈ విషయంలో పోలీసులు మరింత లోతైన విచారణ జరుపుతున్నారు.  

Tags:    

Similar News