పెళ్లి అయిన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య

Update: 2020-01-31 15:23 GMT

పెళ్లి అయి రెండు నెలలు మాత్రమే అవుతుంది. పాపం ఎం కష్టం వచ్చిందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకుంది ఆ నవవధువు. ఈ సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీకి చెందిన సోమవరం సంతోష్‌ కి మలక్‌పేటకు చెందిన పల్లవి(28)తో గత ఏడాది డిసెంబర్ 8 న వివాహం జరిగింది.

పని నిమిత్తం భర్త సంతోష్ బయటకు వెళ్ళగా, అత్తమామలు ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపధ్యంలో పల్లవి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆసుపత్రికి వెళ్ళిన అత్తమామలు కోడలు పల్లవికి ఫోన్ చేయగా ఎంతకు ఫోన్ తీయకపోవడంతో పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి పల్లవిని పిలవమని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో గదిలో పల్లవి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించడంతో వెంటనే పల్లవి చనిపోయిందని  ఆమె భర్తకి, అత్తమామలకి సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News