హయత్‌‌నగర్‌లో యువతి కిడ్నాప్‌ కేసులో కొత్త కోణం

Update: 2019-07-30 10:06 GMT

హయత్‌‌నగర్‌లో యువతి కిడ్నాప్‌ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బళ్లారిలో దొంగిలించిన కారుని జీపీఆర్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ కదలికలు కనుగొన్నారు. కర్నూలు, తిరుపతిలో కిడ్నాపర్ సంచరిస్తున్నట్లు గుర్తించారు. అయితే అక్కడ తృటిలో తప్పించుకున్న కిడ్నాపర్‌.. అద్దంకి, ఒంగోలు సమీపంలోకి వెళ్లాడు. ఆ పరిసర ప్రాంతాల్లో కారును గుర్తించి.. కిడ్నాపర్ రవిశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్ తరలించారు. 

Tags:    

Similar News