రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం

Update: 2021-02-23 09:30 GMT

రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం

తెలంగాణలో రేపటి నుంచి 6,7,8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభించుకోవచ్చని మంత్రి సబిత వెల్లడించారు. కోవిడ్‌ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అయితే తరగతులను రేపటి నుంచి మార్చి ఒకటో తేదీలోగా ప్రారంభించుకోవచ్చన్నారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News