భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు గట్టి దెబ్బ

* ఎస్పీ ముందు మావోయిస్టుల లొంగుబాటు * మావోయిస్టుల సానుభూతిపరులుగా ఉన్న 52 మంది లొంగుబాటు

Update: 2021-09-09 14:00 GMT

ఎస్పీ ముందు మావోయిస్టుల లొంగుబాటు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Maoist Surrender: మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్‌ ముందు భారీగా మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. మావోయిస్టు సానుభూతిపరులుగా, మిలీషియా సభ్యులుగా, గ్రామ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న 52 మంది ఎస్పీ ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారు చర్ల మండలంలోని పూసగొల్ప, బత్తినపల్లి, బట్టిగూడెం, చెన్నాపురం గ్రామస్తులని అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.

Tags:    

Similar News