మంత్రి KTR చొరవతో హైదరాబాద్‌కు చేరుకున్న గల్ఫ్ బాధితులు

Update: 2020-02-15 05:30 GMT
మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్‌కు చేరుకున్న గల్ఫ్ బాధితులు

ఇరాక్‌లో చిక్కుకున్న గల్ఫ్ బాధితులు హైదరాబాద్ చేరుకున్నారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇరాక్‌ లో చిక్కుకున్న 16మంది తెలంగాణవాసులు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శంషాబాద్‌లో తమ కుటుంబ సభ్యులను చూసిన బాధితులు బోరున విలపించారు.

ఇరాక్‌లో చిక్కుకుని తిండి లేక ఎన్నోరోజులు పస్తులున్నామని వారు వాపోయారు. ఇరాక్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఏజెంట్లు మోసం చేశారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నామని బాధితులు వెల్లడించారు. 

Tags:    

Similar News