తెలంగాణలో కొత్తగా 1,378 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-09-28 04:51 GMT

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,932 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,87,211కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,56,431కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,054 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 35,465 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 28,86,334 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.59గా ఉందని, రికవరీ రేటు 83.55 శాతంగా ఉందని వివరించింది.



Tags:    

Similar News