మంత్రి వర్గ విస్తరణతో టీఆర్ఎస్ లో చెలరేగిన అసమ్మతిని చల్లార్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. అసమ్మతి స్వరం వినిపించిన నేతలకు గౌరవ ప్రధమైన పదవులు ఇస్తామంటు ప్రగతి భవన్ వర్గాలు ఫోన్లో సమాచారం అందించాయి. మీడియాతో ఎవరూ చిట్ చాట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అధిష్టారం రంగంలోకి దిగడంతో అసమ్మతి రాగం వినిపించిన నేతలు స్వరం మార్చుకున్నారు.