జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు జరగొచ్చన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గతంలో జరిగిన జీహెచ్ఎంసీలో 150 సీట్లకు 99 సీట్లు గెలిచామని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో 106 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని. మలక్పేట నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం బస్తీ, యాకత్పుర పరిధిలోని వినయ్నగర్ కమిటీ హాల్, బహుదూర్పురాలలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.