క్రమంగా తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోగా తాజాగా మరో ఎమ్మెల్యే కారెక్కేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్లో చేరనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ ప్రజలనుండి దూరం అవుతోందని.. సీఎం కేసీఆర్తో కలిసి నడుస్తానని సురేందర్ వెల్లడించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేందర్ చెప్పారు. రేగ కాంతారావు.. ఆత్రం సక్కు.. చిరుమర్తి లింగయ్య.. హరిప్రియా నాయక్.. సబితా ఇంద్రారెడ్డి. కందాళ ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరావు లు టీఆర్ఎస్ లో చేరారు. ఇక మరో ఎమ్మెల్యే చేజారిపోతుండడంతో కాంగ్రెస్ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు.