కోహ్లీ జురాసిక్‌ వరల్డ్‌ ఫస్ట్‌ టీజర్

లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ టీంఇండియా సారథి విరాట్‌కోహ్లీ దంపతులు ఇంటికే పరిమితమయ్యారు.

Update: 2020-05-24 09:29 GMT

లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ టీంఇండియా సారథి విరాట్‌కోహ్లీ దంపతులు ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల కోహ్లీ డైనోసార్‌లా నడిచి వెళ్తున్న వీడియోను అనుష్కశర్మ సోషల్ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు కొత్తగా ఆలోచించి కోహ్లీ డైనోసార్‌లా నడుస్తున్న ఫోజును కట్‌చేసి ఆసక్తికర మీమ్స్‌ రూపొందించారు. కొందరు పలు హాలీవుడ్‌ సినిమా పోస్టర్లకు, కార్టూన్‌ చిత్రాలకు ఆ పోజును అంటించి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు.


గాడ్జిల్లా, జురాసిక్‌పార్క్‌ లాంటి సినిమా పోస్టర్లూ ఉన్నాయి. కాగా.. ఒక నెటిజన్‌ మరో అడుగు ముందుకేసి అనుష్కశర్మ షేర్‌ చేసిన వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో జురాసిక్‌ పార్క్‌ అడవి స్టిల్‌ను జత చేశాడు. వీడియో చూస్తే కోహ్లీ నిజంగా జురాసిక్‌ పార్క్‌లో డైనోసార్‌‌లా నడిచి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. దానికి కోహ్లీ జురాసిక్‌ వరల్డ్‌ ఫస్ట్‌ టీజర్‌ అని కామెంట్‌ చేస్తూ , కోహ్లీకి,అనుష్క ట్యాగ్‌ చేశాడు.



Tags:    

Similar News