PBKS vs DC: ఢిల్లీ టార్గెట్ 167; కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్(99*)

IPL 2021 PBKS vs DC:పంజాబ్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

Update: 2021-05-02 15:56 GMT

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్

IPL 2021 PBKS vs DC: పంజాబ్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మయాంక్‌ అగర్వాల్‌( 99, 58 బంతులు; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

మలాన్‌ 26 పరుగులు చేయగా.. మిగతావారు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో రబడ 3, ఆవేశ్‌ఖాన్‌, అక్షర్‌ పటేల్‌లు చెరో వికెట్‌ తీశారు.

Tags:    

Similar News