ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముందుగా బ్యాటింగుకు దిగిన ముంబై ఇండియన్స్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన 3వ ఓవర్ మూడో బంతికి డికాక్(4) కేదార్కు క్యాచ్ ఇచ్చాడు. అతని తరవాత రోహిత్ శర్మ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. సూర్యకుమార్తో కలిసి రెండో వికెట్కి 37 పరుగులు జోడించాడు.
అయితే రవీంద్ర జడేజా ఓవర్లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన యువరాజ్ సింగ్(4) భారీ షాట్కు ప్రయత్నించి.. అంబటి రాయుడుకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ముంబై స్కోర్ 82 పరుగులు 3 వికెట్ల నష్టానికి.