శ్రీవారి సన్నిధికి రమణదీక్షితులు రీఎంట్రీ
18 నెలల తరువాత టీటీడీ ఆగమ సలహాదారుడి హోదాలో మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేసిన రమణదీక్షితులు.
(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)
18 నెలల తరువాత టీటీడీ ఆగమ సలహాదారుడి హోదాలో మహాద్వారం నుంచి శ్రీవారి ఆలయ ప్రవేశం చేశారు రమణ దీక్షితులు. గురువారం సాయంత్రం సమయంలో శ్రీవారి దర్శనం కోసం రమణదీక్షితులతో పాటు రిటైర్డ్ వంశపారంపర్య అర్చకులు, రమణదీక్షితుల కుమారుడు వెంకటపతి దీక్షితులు, పలువురు వంశపారంపర్య అర్చకులు ఆలయంలోకి వెల్లారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా భూవరాహస్వామివారిని దర్శించుకొన్న దీక్షితులు అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు.