జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు .. వ్యక్తిగతంగా మరియు జనసేన పార్టీ తరుపున అయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు .. ఈ సందర్బంగా పవన్ రంజాన్ పండగ యొక్క విశిష్టతను తెలిపే ప్రయత్నం చేసారు ..
పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో మానవాళికి అవసరమైన మానసిక , ఆధ్యాత్మిక వికాసానికి , జీవన సౌపల్యానికి ఉపయుక్తమయ్యే అంశాలు ఈ పండగలో దాగి ఉన్నాయని అన్నారు . అంతేగాకుండా, మనుషుల మధ్య స్నేహసంబంధాలకు, శాంతికి ప్రతిరూపమే రంజాన్ అని వివరించారు. ఇఫ్తార్ విందులతో మతసామరస్యం సాధ్యమేనని, అలాంటి రంజాన్ పవిత్రమాసం స్ఫూర్తి ఎల్లప్పుడూ కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
రంజాన్ శుభాకాంక్షలు - JanaSena Chief @PawanKalyan pic.twitter.com/MFXsMDeWfc
— JanaSena Party (@JanaSenaParty) June 4, 2019